జులై 1న గోర్‌ బంజారా జాతీయ సమ్మేళనం

నవతెలంగాణ-ఓయూ
లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జూలై 1న రవీంద్ర భారతిలో నిర్వహించే గోర్‌ బంజారా జాతీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని లంబాడి స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు అశోక్‌ నాయక్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం ఎల్‌హెచ్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ బెల్లయ్య నాయక్‌ ఆధ్వర్యంలో అనేక డిమాండ్లు సాధించామని.. జులై1న జరగబోయే జాతీయ సమ్మేళన ంలో గోర్‌ బోలిని రాజ్యాంగంలోని 8 షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌తో బెల్లయ్య నాయక్‌ ఆధ్వరంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు చెప్పారు. ఈ గోర్‌ బంజారా సమ్మేళన్‌ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతిని ధులు, ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఎస్‌ఓ ప్రధాన కార్యదర్శి విజేందర్‌ పవార్‌, కార్యదర్శి జగదీష్‌ నాయక్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సంతోష్‌ నాయక్‌, గ్రేటర్‌ హైదరబాద్‌ అధ్యక్షులు వెంకటేష్‌ నాయక్‌, ఓయూ అధ్యక్ష కార్యదర్సులు చందర్‌ -గణేష్‌, విద్యార్థి నాయకులు కిషన్‌,రాజు, జంపన్న, సురేందర్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

Spread the love