ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పునర్వైభవం తీసుకురావాలి

నవతెలంగాణ – భువనగిరి
పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను అభివృద్ధి చేసి పునర్ వైభవం తీసుకురావాలని పూర్వ విద్యార్థులు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం స్థానిక కళాశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు హాజరై తమ తమ అభిప్రాయాలను సూచనలను చేశారు. భవిష్యత్తు కార్యాచరణ ఏర్పాటు చేసుకొనుటకు ఒక అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల (భువనగిరి) అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన.. అడహక్ కమిటీ.కన్వీనర్..జిట్టా బాలకృష్ణ రెడ్డి. కో కన్వీనర్లుగా.1)అతికం లక్ష్మీ నారాయణ., 2)కొలుపుల వివేకానంద, 3)గోమారి సుధాకర్ రెడ్డి, సభ్యులు..1)పూస శ్రీనివాస్, 2)శేక్.హమీద్ పాశ3)సాధు విజయ్ కుమార్, 4)జిట్టా భాస్కర్ రెడ్డి,5)మిర్యాల శ్రీనివాస్,6)మాటూరి బాలేశ్వర్, 7)పెంట నర్సింహ,  8)మద్ది వెంకట నర్సింహారెడ్డి 9)ఏశాల అశోక్. ప్రత్యేక ఆహ్వానితులుగాకళాశాల ప్రిన్సిపల్ పాపిరెడ్డిని నియమించారు.
Spread the love