![](https://navatelangana.com/wp-content/uploads/2024/06/006VMDIMG-20240628-WA0524-300x297.jpg)
వేములవాడ దేవస్థానం అభివృద్ధి కొరకు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధు శేఖర భారతి స్వాముల వారు పలు సలహాలు,సూచనలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని రానున్న రోజుల్లో వారి పరిపాలన సుభిక్షంగా జరగాలని, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవాలని దీవించారు అని అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శృంగేరీ శారదాపీఠం పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధు శేఖర భారతి స్వాముల వారిని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవాల్సిందిగా కోరగా దీనికి స్వామి వారు సానుకూలంగా స్పందించారు అని వెల్లడించారు.