నవతెలంగాణ – వేములవాడ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం వేములవాడ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే, తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర,బాలికల,తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర,బాలికల,కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు..అనంతరం పాఠశాలలను తనిఖీ చేసి తన దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులతో కాసేపు మాట్లాడారు ఏమైనా సమస్యలు ఉంటే ఉపాధ్యాయులకు లేదా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలందరూ తప్పకుండా నులిపురుగుల నివారణ మాత్రలను వేసుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించాడం జరుగుతుందన్నారు.
శరీకకంగా బలంగా ఉన్నప్పుడే మనం చదువులోరాణించగలుగుతామన్నారు. నులిపురుగుల ద్వారా పిల్లల్లో శారీరక ఎదుగుదల ఉండక పోవడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలన్నారు.
శరీకకంగా బలంగా ఉన్నప్పుడే మనం చదువులోరాణించగలుగుతామన్నారు. నులిపురుగుల ద్వారా పిల్లల్లో శారీరక ఎదుగుదల ఉండక పోవడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలన్నారు.
