ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు..

నవతెలంగాణ – తిరుమలగిరి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు తిరుమలగిరి పట్టణంలో మరియు మండలంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్,  బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీల  నాయకులు, అధికారులు వారి కార్యాలయాల్లో  జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ శాగంటి అనసూయ రాములు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సుధా, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో లాజర్, పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి, ఎస్సై సత్యనారాయణ పథకావిష్కరణ గావించి తెలంగాణ సాధనలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కేసిడి సరళ యాదవ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లు  బత్తుల శ్రీను, కుదురుపాక శ్రీలత రాములు, జితేందర్ రెడ్డి,పత్తే పురం సరిత, చిరబోయిన హనుమంతు, గిల కత్తుల ప్రియలత రామ్ గౌడ్, నాయకులు మీడియా ఇంచార్జి కందుకూరి లక్ష్మయ్య, మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, జెడ్పిటిసి దూపటి అంజలి రవీందర్,మాజీ గ్రంథాలయ చైర్మన్ మోడేపు సురేందర్, కౌన్సిలర్ నరోత్తం రెడ్డి,నాయకులు షకీల్, కందుకూరి బాబు, బర్ల వెంకన్న, త్రిశూల్ తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love