పెద్దపల్లి జిల్లాలో చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పెద్దపల్లి జిల్లాలోని మానేరు వాగు చుట్టూ ఆయా గ్రామాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం కోసం నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులను ఇచ్చింది. ఈమేరకు సాగునీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా వేర్వేరుగా జీవోలతో ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గొల్లపల్లి గ్రామంలో మానేరు వాగు చుట్టూ చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.27.09 కోట్లు మంజూరు చేశారు. అలాగే ఇదే మండలంలోని మంచరామి గ్రామంలో కూడా మానేరు వాగు చుట్టూ చెక్‌డ్యామ్‌ నిర్మించడాఇకి రూ.30.67 కోట్లు కేటాయించారు. ఇదిలావుండగా పెద్దపల్లి జిల్లా సిద్దులకుంట పునరుద్ధరణ పనుల కోసం రూ.2.23 కోటుకు మంజూరు ఇస్తూ రాహుల్‌ బొజ్జా ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల సీఈలతోపాటు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ చర్యలు తీసుకోవాలని ఆయా జీవోల్లో పేర్కొన్నారు.

Spread the love