![](https://navatelangana.com/wp-content/uploads/2024/06/IMG-20240617-WA0064.jpg)
బక్రీద్ పర్వదిన వేడుకలను మండల వ్యాప్తంగా సోమవారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పసర చలువాయి గోవిందరావుపేట గ్రామాలలోని ఈద్గాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు అలై బలై తీసుకున్నారు. హిందూ ముస్లిం సోదరులు పలు రాజకీయ పార్టీల నాయకులు బక్రీదు పండగ సందర్భంగా సోషల్ మీడియాలో మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తి భాగానికి స్ఫూర్తి బక్రీదు పండగ అని రాజకీయ నాయకులు ప్రముఖులు ఇతరులు పండగ పవిత్రతను కొనియాడారు.