డీపీఆర్ఓ కు ఘనంగా సన్మానం

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులుగా నల్గొండ జిల్లా నుండి మహబూబ్ నగర్ కు ఎన్నికల బదిలీలలో భాగంగా బదిలీ అయిన పి.శ్రీనివాస్ కు అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్(రెవెన్యూ),జిల్లా అధికారులు సోమవారం కలెక్టర్ కార్యాలయం లో ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సంబంధాల అధికారిగా 5 సం.ల 9 నెలలు జిల్లాలో సేవలు అందించారని కొనియాడారు. పి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్ లు, అందరి సహకారం తో విధులు నిర్వర్తించడం జరిగిందని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love