నన్ను ఎన్నో మాటలన్నారు..నాకు చాలా అన్యాయం జరిగింది: హార్దిక్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ టీ20 వరల్డ్ కప్ ముఖ్యంగా నాకేంతో ప్రత్యేకమని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తెలిపాడు. నిన్న జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించి రెండో సారి టి20 వరల్డ్ కప్ అందుకుంది. ఈ విజయంలో చివర ఓవర్ వేసిన ఇండియాను గెలిపించిన పాండ్యా బావోద్వేగానికి గురైయ్యాడు. ‘వ్యక్తిగతంగా నా గురించి ఒక్కశాతం కూడా తెలియని వారు నా గురించి ఏవేవో మాట్లాడారు. నా జీవితం గత 6నెలలుగా ఎలా ఉందో మీకు తెలుసు. నేనొక్క మాట మాట్లాడకున్నా నాకు చాలా అన్యాయం జరిగింది. వాటికి మాటలతో స్పందించాలనుకోలేదు. పరిస్థితులే సమాధానం చెబుతాయి’ అని ట్రోలర్స్‌ను ఉద్దేశిస్తూ పాండ్య అన్నారు.

Spread the love