- Advertisement -
నవతెలంగాణ – మోర్తాడ్
మండలం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం సందర్భంగా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం నిర్వహించారు. సర్పంచి రాదా అధ్యక్షతన జరిగిన 25 26 విద్యా సంవత్సర ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు తోపాటు మెమొంటో శాలువాతో విద్యార్థులను సన్మానించారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాల తో పాటు గ్రామ ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని సర్పంచ్ రాధా అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాలరావు, ఉపాధ్యాయులు మహేష్, చంద్రశేఖర్, స్వామి, రాజేందర్, జయశ్రీ ,రాజేశ్వరి,లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


