పెన్షన్ దారులకు భారీ గుడ్ న్యూస్..

నవతెలంగాణ-హైదరాబాద్ : పెన్షన్‌దారులకు చంద్రబాబు ప్రభుత్వం భారీ గుడ్ న్యూ్స్ చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నిమిత్తం రూ.4,400 కోట్ల నిధులను శనివారం విడుదల చేసింది. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు సంబంధించి అన్ని జిల్లాలో కలెక్టర్లతో సీఎస్ నీరభ్ కుమార్ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. జూలై 1వ తేదీన 65.18 లక్షల మంది లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించారు. సోమవారం ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని ఆదేశించారు.

Spread the love