రామగిరి, కమాన్ పూర్ లో పూలేకు ఘన నివాళులు 

నవతెలంగాణ – రామగిరి
రామగిరి, కమాన్ పూర్ మండలాల్లో మహాత్మా జ్యోతిభా పూలే 197వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు జ్యోతిభా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగిరి మండల అధ్యక్షుడు రొడ్డ బాపన్న, మాజీ జడ్పీటీసీ మైదం భారతి – వరప్రసాద్, ఐఎన్టియుసి ఆర్జీ-3 ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి, పన్నూర్ ఎంపిటిసి కొప్పుల గణపతి, రామగిరి బీసీ సెల్ అధ్యక్షుడు బండారి సదానందం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కండె పోషం, నాయకులు ఉడుత శంకర్, మోత్కూర్ నవీన్ గౌడ్, మడ్డి రాజకుమార్,పి శ్రీనివాస్ చారి,తాళ్లపల్లి విష్ణు గౌడ్ , కాటసత్యం గిరేవేన రాములు,   ఏల్పుల సరోజన, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్, తీగల శ్రీధర్, దొంతుల సురేష్, బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంథని నియోజకవర్గ ఇంఛార్జి జనగామ రవికుమార్, నియోజకవర్గ కోశాధికారి పులిపాక బొంద్యాలు, రామగిరి మండల అధ్యక్షుడు రేణుకుంట్ల మల్లేశ్, రొంపికుంట సెక్టార్ అధ్యక్షుడు గజ్జల సురేష్, బీఎస్పీ నాయకులు రాయమల్లు శ్రీను, బీసీ సంక్షేమ సంఘం మంథని డివిజన్ అధ్యక్షులు నూనె రాజేశం ఆధ్వర్యంలో కార్యక్రమంలో బీసీ నాయకులు చిట్టెవేన రాజేశం, గుర్రాల పెద్దలు, దొంతరవేన మల్లయ్య, చిట్టి మల్లయ్య, గిరేవేన సమ్మయ్య, పర్సవేని సమ్మయ్య, కలెవేన సంపత్, చొప్పరి నగేష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love