ప్రకృతి వనరుల సక్రమ వినియోగంతోనే మానవ మనుగడ..

నవతెలంగాణ – ధర్మసాగర్ 
ప్రకృతి వనరుల సక్రమ వినియోగంతోనే మానవ మనుగడ ఉంటుందని  డాక్టర్ రాములు అన్నారు. బుధవారం మండలంలోని దేవనూరు గ్రామంలోని ఇనుపరాతి గట్ల లో జన విజ్ఞాన వేదిక, యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని  ఇనుప రాతి గట్లల్లో ట్రిక్కింగ్ నిర్వహించారు. తదనంతరం శ్రవణ్ కుమార్ అధ్యక్షతన భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత అను  అంశాన పర్యావరణ పరిరక్షణ సదస్సు నిర్వహించారు.ఇందులో జన విజ్ఞాన వేదిక పర్యావరణ విభాగం రాష్ట్ర కన్వీనర్ ధర్మ ప్రకాష్ రచించిన “దేవునూర ఇనుపరాతి అటవీ గట్టు హనుమకొండ కే ఆయువు పట్టు” అనే బుక్ లెట్ ను ఆవిష్కరించారు. శ్రవణ్ కుమార్, దుర్గాచార్యుల పర్యావరణ గీతాలు,కవితలు ఆహుతులను అలరించాయి. సదస్సు ప్రధాన వక్త విశ్రాంత జంతుశాస్త్ర ఆచార్యులు డాక్టర్ రాములు మాట్లాడుతూ.. ప్రకృతి వనరుల సక్రమ వినియోగం తోనే మానవ మను కడఉంటుందన్నారు.
ప్రకృతి వనరులపై ఆధిపత్యం ప్రజల చేతుల్లో ఉండాలన్నారు.కీలక ఉపన్యాసం చేసిన విశ్రాంత అటవీ అధికారి పురుషోత్తం మాట్లాడుతూ.. దేవునూర్ ఇంపరాతి గట్లను రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలన్నారు. ఈ ప్రాంతంలో ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దుపరిచి, అక్రమ మైనింగ్ నిర్వహించకుండా చూడాలని అన్నారు. ధర్మసాగర్ చెరువు పరిసర సుందర కాకతీయ కట్టడాలను కలుపుకొని ఎకో టూరిజం గా అభివృద్ధి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నూతనంగా ఎంపీగా ఎంపికైన  కడియం కావ్య కృషి చేయాలన్నారు. ఇటీవల కాలంలో మరణించిన దివంగత ప్రకృతి ప్రేమికులు నల్లల రాజయ్య, ఎగ్గని నాగయ్యలకు సమావేశం సంతాపం తెలిపి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక పర్యావరణ క్లబ్ల నుండి రాజు, రవీందర్ కిషోర్ ,నాగార్జున, తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలల ఆచార్యులు కుర్షిత్ అహ్మద్, విశ్రాంత మండల పరిషత్ అభివృద్ధి అధికారి బ్రహ్మచారి ఇగ్నైటెడ్ మైండ్స్ సంస్థ నుండి బిక్షపతి,జగన్మోహన్,శ్రీనివాస్ స్థానిక గ్రీన్ వారియర్స్ కమలాకర్ స్వామి బృందం తదితరులు పాల్గొన్నారు.
Spread the love