- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదిరి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో భార్యపై అనుమానంతో గంగరాజు అనే వ్యక్తి తన భార్య సునీతను కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన సునీతను, భర్త బయటకు తీసుకువచ్చి అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



