IND vs PAK : ఆల‌స్యంగా భార‌త్-పాకిస్థాన్ మ్యాచ్

నవతెలంగాణ-హైదరాబాద్ : పొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్థాన్ మ్యాచ్ ఆల‌స్యంగా షురూ కానుంది. కార‌ణం ఏంటంటే.. ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో వాన ప‌డుతోంది. షెడ్యూల్ ప్ర‌కారం 7:30 గంట‌ల‌కు టాస్ వేయాలి. కానీ, అంత‌కుముందే న‌స్సౌ కౌంటీ స్టేడియంలో చినుకులు మొద‌ల‌య్యాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన‌ గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను పూర్తిగా క‌వ‌ర్ల‌తో క‌ప్పేశారు. దాంతో, అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. వాన‌ త‌గ్గాక టీమిండియా, పాక్ సార‌థులు రోహిత్ శ‌ర్మ‌, బాబ‌ర్ ఆజాంలు టాస్ కోసం మైదానంలోకి రానున్నారు.

Spread the love