IND vs SA | ముగిసిన ఇండియా బ్యాటింగ్..సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?

నవతెలంగాణ-హైదరాబాద్ :  టీ20 ప్ర‌పంచ క‌ప్‌ ఫైనల్ లో ఇండియా బ్యాటింగ్ ముగిసింది. నిర్ణిత 20 ఓవర్లకు ఇండియా 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికాకు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. దీంతో కోహ్లీ, అక్షర్ పటెల్ స్కోరును పెంచారు. కోహ్లీ(76) అక్షర్ (47), దూబే (27) పరగులు చేయడంతో ఇండియా 176 పరుగులు చేయగలిగింది.

Spread the love