నవతెలంగాణ-హైదరాబాద్ : పొట్టి ప్రపంచ కప్లో ఆఖరి యుద్ధం. ఓటమెరుగని రెండు జట్ల మధ్య ఉత్కంఠ రేపేలా టైటిల్ ఫైట్ జరగడం చరిత్రలో ఇదే ప్రథమం. ఈ మహా సంగ్రామంలో ఒకరు గెలిస్తే చరిత్ర.. మరొకరు ట్రోఫీని ముద్దాడితే రికార్డు. తొమ్మిదో సీజన్లో అజేయంగా టైటిల్ వేటకు దూసుకొచ్చిన ఇండియా, దక్షిణాఫ్రికాలు కింగ్స్టన్ ఓవల్ మైదానంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్జి, ఒట్నిల్ బార్ట్మన్