పోలింగ్ కేంద్రాల పరిశీలన 

నవతెలంగాణ- కొత్తగూడ: మండలం లోని పలు పోలింగ్ కేంద్రాలను ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ పరిశీలించారు. శుక్రవారం మండలంలో పర్యటించిన ఆయన తహసిల్దార్ రమాదేవితో కలిసి మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను కలియతిరిగి పోలింగ్ కేంద్రాల పరిసరాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చే ఓటర్లకు, పనిచేసేందుకు వచ్చే ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వారి వెంట ఏఓ జక్కుల ఉదయ్, మిషన్ భగీరథ ఏఈ నరేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love