నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ ఏపీఈ./ ఐపిసిహెచ్./ ఐఎంబిఏ/ ఆరవ, ఎనిమిదవ, పదవ, ఎల్.ఎల్.బి. ఆరవ, ఎంబీఏ/ఎంసీఏ.ఒకటవ, మూడవ, ఐఎంబిఏ. ఏడవ, తొమ్మిదవ,సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు 09వ రోజు గురువారం ప్రశాంతంగా జరిగాయి. తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, న్యాయ కళాశాల లో జరిగిన పరీక్షకు ఉదయం 71 మంది విద్యార్థులకు 71 మంది విద్యార్థులు హాజరయ్యారు.మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 187 మంది విద్యార్థులకు 169 మంది విద్యార్థులు హాజరయ్యారని 18 మంది విద్యార్థులు గైరాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలియజేశారు.