మిగిలిపోయిన ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ – రామారెడ్డి
తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు గల ఖాళీలకు విద్యార్థులు  దరఖాస్తులు చేసుకోవాలని శుక్రవారం ఉప్పల్వాయి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 12- 07- 2024 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, గ్రామీణ ప్రాంత తల్లిదండ్రుల ఆదాయం రూ 1.50 లక్షలు, పట్టణ ప్రాంత తల్లిదండ్రుల ఆదాయం రూ 2 లక్షల లోపు ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాఠశాలలు బదిలీ కోరుకునేవారు, 31- 07- 2024 లోపు రూ 100 రుసుము చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సత్యనారాయణ సూచించారు.
Spread the love