నవతెలంగాణ – చేర్యాల
ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.ప్రణిత శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రణిత మాట్లాడుతూ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పీజీ కోర్సులలో 55 శాతం మార్కులతో పాసై ఉండాలని, (ఎస్సీ, ఎస్టీ లకు 50 శాతం సరిపోతుంది)ఎన్ ఈ టీ, ఎస్ ఈ టీ.పీహెచ్ డీ ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, జులై 2వరకు దరఖాస్తులు స్వీకరించ బడుతాయని అన్నారు. జులై 3న బుధవారం ఉదయం 10.30 నుండి సిద్దిపేట లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (స్వయం ప్రతిపత్తి ) ఇంటర్వ్యూ నిర్వహించబడుతున్నట్టు పేర్కొన్నారు. ఆంగ్లము1, చరిత్ర 1,రాజనీతి శాస్త్రం 1,కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ 1, కామర్స్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మిగతా సమాచారం కోసం చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సంప్రదించాలన్నారు.