శివరాత్రి జాతరకు ఆహ్వానం..

– మంత్రులకు , కమిషనర్ కి ఆహ్వాన పత్రికను అందించిన ఆలయ ఈవో
నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి- శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో ఈ నెల 7 నుండి 9 వరకు జరగనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు రావాలని, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ లను రాజన్న ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్ లోని సచివాలయంలో  ఈవో  మర్యాదపూర్వకంగా కలిసి మంత్రాలను శాలువాలతో సత్కరించి ఆహ్వానించారు, ఆహ్వాన పత్రికను వేరువేరుగా అందించారు.మంత్రులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారి వెంట దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love