- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జీవో 97 రద్దు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. మాజీ విద్యాశాఖ మంత్రిగా జీవో 97ను రద్దు చేస్తూ, పాలిటెక్నిక్ను ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్తో కలిపే ఉంచాలన్నారు. ఈ జీవోతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నందున, పాలిటెక్నిక్ విద్యార్థులను టెక్నికల్ ఎడ్యుకేషన్లోనే కొనసాగించాలన్నారు. అలాచేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదనే భరోసాను ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వం పెద్ద మనసుతో జీవో 97ను రద్దు చేయాలని కడియం కోరారు.
- Advertisement -



