తుంగతుర్తి నియోజకవర్గం ప్రెస్ ఇన్చార్జిగా కందుకూరి లక్ష్మయ్య

నవతెలంగాణ –  తిరుమలగిరి 
కాంగ్రెస్ పార్టీ నుండి తుంగతుర్తి నియోజకవర్గ  ప్రెస్ ఇన్చార్జిగా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ  నాయకులు  కందుకూరిలక్ష్మయ్య ను ఎమ్మెల్యే మందుల సామేలు నియమించి బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మయ్య విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేలు సంబంధించిన ప్రతి కార్యక్రమం తుంగతుర్తి నియోజకవర్గం లోని అన్ని మండలాల ప్రెస్ మిత్రులకు అందజేస్థామని,ఎమ్మెల్యే తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని చెప్పారు.
Spread the love