Friday, May 29, 2026
E-PAPER
Homeకరీంనగర్కరీంనగర్ జ్యువెల్లరీ చోరీ..ప్రధాన సూత్రధారి కోర్టులో హాజ‌రు

కరీంనగర్ జ్యువెల్లరీ చోరీ..ప్రధాన సూత్రధారి కోర్టులో హాజ‌రు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీలో జరిగిన రూ.80 లక్షల నగల దోపిడీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బీహార్ జైలు ఖైదీ సుభోద్ సింగ్‌ను పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. కేసులో మొత్తం 13 మంది నిందితులు ఉండగా, ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుభోద్ సింగ్‌ను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -