శ్రీ భాషిత పాఠశాలలో కిండర్ గార్డెన్స్ గ్రాడ్యుయేషన్ డే

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణం లోని శ్రీ భాషిత పాఠశాలలో శనివారం సాయంత్రం నటరాజ ఫంక్షన్ హాల్ లో పి పి 3 విద్యార్థులకు కిండర్ గార్డెన్స్ గ్రాడ్యుయేషన్ డే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఐఎంఏ సెక్రటరీ  డాక్టర్ భాను రామగిరి గారు (లైఫ్ హాస్పిటల్) ఐఎం ఏ డాక్టర్ యు.రాకేష్ కుమార్(బాలరాజ్ మెమోరియల్ హాస్పిటల్) పాల్గొన్నారు. ఈ వేడుకలలో పి పి1,2,3 విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా డాక్టర్ భాను రామ్ గిరి మాట్లాడుతూ ఇంత చిన్న పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే అనేది మేము ఎప్పుడూ చూడలేదు  డిగ్రీలు చదువుతేనే గ్రాడ్యుయేట్ పట్టా ఇచ్చేవాళ్ళు. కానీ శ్రీ భాషిత పాఠశాల మాత్రం పి పి 3 విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే ని ఏర్పాటు చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్న శ్రీ భాషిత  పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. డాక్టర్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ పిల్లలు ఇంత చిన్న వయసులోనే జనరల్ నాలెడ్జ్ సంబంధించిన విషయాలు నేర్చుకోవడం చాలా అద్భుతంగా ఉంది అని అన్నారు.  పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ మా పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం వల్ల విద్యార్థులకు ఒక మంచి ఉల్లాసాన్ని అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది.  దీనికి సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love