కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించండి : బక్కతట్ల లింగస్వామి యాదవ్

నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బక్కతట్ల లింగస్వామి యాదవ్ ఆధ్వర్యంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని నమూనా ఈవీఎం బ్యాలెట్ తో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బక్కతట్ల లింగస్వామి యాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ భరోసా, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడిగారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా మూడోసారి అవడం ఖాయం మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ పేట సర్పంచ్ చక్రం జంగయ్య, మాజీ సర్పంచ్ ఆల్మాసిపేట కిష్టయ్య, ఉపసర్పంచ్ ఏనుగు బాలమణిమాధవరెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love