మార్కెట్ ఛైర్మన్ గా కొప్పుల వేణా రెడ్డి

– వైస్ ఛైర్మన్ గా వీరన్న నాయక్
నవతెలంగాణ – సూర్యాపేట
తెలంగాణ లోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ గా పేరుగాంచిన సూర్యాపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల వేణా రెడ్డి నియమితులయ్యారు. అదేవిధంగా  చివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు వీరన్న నాయక్ కు వైస్ చైర్మన్ పదవి దక్కింది. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు ఆనందోత్సాహాలతో సోషల్ మీడియాలో వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హల్ చల్ చేస్తున్నారు.కాగా గత పది సంవత్సరాలు గా మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వెంట ఉంటూ పార్టీ కోసం పని చేసిన వారికి కమిటీలో డైరెక్టర్ లుగా పదవులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దామన్న కమిటీ కి సంబంధించిన పూర్తి వివరాలను అధిష్టానానికి పంపినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మాత్రం మార్కెట్ చైర్మన్ గా కొప్పుల వేణా రెడ్డి నియమితులైనట్లు ఫోటోలు పెట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇదిగాక స్థానిక రెడ్ హౌజ్ కు వెళ్లి వేణా రెడ్డి ని కలిసి భారీ గజమాలలు,బొకేలు,శాలువాలతో సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అదేవిధంగా నియామకం పట్ల దామోదర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన కొప్పుల వేణా రెడ్డి కి మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారని ఆయన అభిమానులు సంబురాలు జరుపుకుంటున్నారు.
Spread the love