నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏపీ సీఎం జగన్పై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదని పేర్కొన్నారు. ఈ ఘటనను ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.