- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : చంచల్గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ములాఖత్లో కలిశారు. కేటీఆర్తో పాటు పార్టీ సీనియర్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి కూడా బాల్క సుమన్ను పరామర్శించిన వారిలో ఉన్నారు. జైల్లో ఉన్న సుమన్కు పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ భరోసా ఇచ్చారు.
- Advertisement -



