అనంతారంలో కుంభం ప్రచారం..

– విజయ తిలకం దిద్ది, ప్రచారానికి స్వాగతం పలికిన మాజీ ఎంపీపీ…
నవ తెలంగాణ- భువనగిరి రూరల్:
భువనగిరి మండలం అనంతారం గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొనగా, మాజీ ఎంపీపీ ఎర్ర కల్లమ్మ ఆయనకు విజయ తిలకం దిద్దగా, గ్రామంలోని మహిళలు  మంగళ హరతులు ఇచ్చి,  పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటుగా మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై , మాట్లాడారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్తూ సోనియమ్మ తెలంగాణలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రతీ ఒక్కరికి వివరించారు. అనంతరం గ్రామంలో  ఏర్పాటుచేసిన  కార్నర్ మీటింగ్ లో వారు మాట్లాడుతూ భువనగిరిలో ఈసారి ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువకులు, బీఆర్ఎస్ నుండి సుమారు 50 మంది కాంగ్రెస్ లోకి చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కమిటీ సభ్యులు తంగలపల్లి రవికుమార్, ఎల్లంల జంగయ్య యాదవ్, ఫకీర్ కొండల్ రెడ్డి, విట్టల్ వెంకటేష్, చిక్కుల వెంకటేశం, వల్లందాసు ఆదినారాయణ, కోట పెద్ద స్వామి, ఎర్ర శ్రీరాములు, ఓరుగంటి నాగయ్య, బాబురావు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Spread the love