కార్మిక సమస్యలు పరిష్కరించాలి..

నవతెలంగాణ – ధర్మసాగర్
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిన్నారపు   మహేందర్ శుక్రవారం వరంగల్ ఎంపీ  డా.కడియం కావ్య  గారిని భారీ మెజార్టీ తో గెలిసిన సందర్భంగా ఆమెను కలిసి చాలువ ను కప్పి పుష్పగుచ్చం ఇచ్చి వినతి పత్రాన్ని అందజేశారు. మా కార్మికుల సమస్యలు  తీర్చాలని ఎంపీ డా,కావ్యను ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు కి చెర్మైన్ నీ కూడా నియమించలేదని వెల్పర్ బోర్డుకు మా కార్మికుడినే చైర్మన్ గా నియమించాలని ఈ సందర్భంగా గత తెలంగాణ ప్రభుత్వం అర కొర పథకాలతో మా పొట్టకొట్టిందని,వారు మాకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ఈ సందర్భంగా మి ముందు వుంచుతున్నమన్నారు.మా డిమాండ్లను నెరవేరుస్తానని  గుర్తు చేశారు. గత ప్రభుత్వం లో వున్న సంక్షేమ పథకాలను రెండింతలు చేయాలని కోరుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో  బి ఎన్ ఆర్ కే ఎస్ జిల్లా  ఉపాధ్యక్షులు గిన్నారపు రవి,  మల్లంపల్లి ఎంపీటీసీ బింరెడ్డి కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సింగారపు రమేష్,మాజీ సర్పంచ్ నరబోయిన ఎల్లాస్వామి,ముఖ్య నాయకులు గిన్నారపు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love