సీనియర్ పాత్రికేయుడిని సన్మానించిన భవన కార్మిక సంఘం నాయకులు 

నవతెలంగాణ – రామగిరి
ఉత్తమ విలేకరి అవార్డు అందుకున్న సీనియర్ పాత్రికేయుడు జబ్బర్ ఖాన్ ను భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి బుధవారం తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపి పూలమాల, శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. గత 30 సంవత్సరాలు పత్రిక రంగం ప్రయాణంలో విశిష్ట సేవలందించి నిజాన్ని నిర్భయంగా  తన కలం తో గళం వినిపించిన సీనియర్ పాత్రికేయులు జబ్బర్ ఖాన్ అని ,రాష్ట్ర స్థాయి ఉత్తమ విలేకరి అవార్డు అందుకోవడం గర్వ కారణమని, ఇంకా  ఇలాంటి అవార్డులు ఎన్నో వరించాలని స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిల్లా కోశాధికారి ఎస్కే షరీఫ్, బైరి శంకర్,  వెంగళ రాములు పాల్గొన్నారు.
Spread the love