సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నరసింహను గెలిపిద్దాం

నవతెలంగాణ- భువనగిరి: భువనగిరి నియోజకవర్గం సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండమడుగు నరసింహ కు ఓట్లు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం పట్టణంలోని సింగనగూడెంలో సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నరసింహను గెలిపించాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నరసింహను ప్రజలు ఆదరించాలని కోరారు.ఈ నెల 9వ తేదీన సీపీఐ(ఎం) తరఫున నామినేషన్ వేస్తున్నారని ప్రజలందరూ పాల్గొనాలని విద్యార్థి చేశారు. ఈ కార్యక్రమంలో చింతల సత్యనారాయణ, శాఖ కార్యదర్శి చింతల శివ, మన్నె కృష్ణ, ముగ్గు రాములు, పెద్దపూల నరసింహ, మన్నె రాజు పాల్గొన్నారు.
Spread the love