గొంగడి సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపిద్దాం..

నవతెలంగాణ-బొమ్మలరామరం: ఆలేర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే అభ్యర్థి గొంగడి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో మూడోసారి గెలిపించుకుందామని మండల సోషల్ మీడియా కన్వీనర్ కొండ్ర సాయికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ రెండు వందల నుండి 3000 వరకు పెంచిన ఘనత దేశంలో సీఎం కేసీఆర్ కె దక్కిందని అన్నారు. రైతుబంధు, రైతు బీమా, దళిత బందు, బీసీ బందు, గృహలక్ష్మి వంటి అనేక పథకాలను అమలు చేసి బంగారు తెలంగాణ మారుస్తున్నారని అన్నారు. గ్యారెంటీ పథకాలతో గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ నమ్మొద్దని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించి కెసిఆర్ ను ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరి పైన ఉందని గుర్తు చేశారు. శాసనసభ సభ్యురాలు గొంగడి సునీత నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశారని గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణంతోపాటు, కాలువల వంటి మౌలిక సదుపాయాల కల్పించారని వారన్నారు. నియోజకవర్గంలో సాగునీటి కొరతతో ఎటహరిగా మారినా ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసిన సునీతమ్మ కే దక్కిందని ఈసారి కూడా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మండల ప్రజలను కోరారు.
Spread the love