భగత్ సింగ్ స్పూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం: పీడీఎస్ యూ

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం యాసోజి గూడెం బుధవారం, భగత్ సింగ్ 93వ వర్ధంతి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  పి వై ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భారతదేశ విముక్తి కోసం, స్వేచ్చా స్వాతంత్ర్యం కోసం తమ విలువైన ప్రాణాలను భారత జాతికి అంకితం ఇచ్చారు. ఉరితాడును ముద్దాడి అమరులయ్యారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల స్పూర్తితో యువత యువజన పోరాటాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికా, రష్యా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. దేశంలో రోజురోజుకీ మతోన్మాదం, ఫాసిజం పెరుగుతుంది అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో విఫలం అయ్యాయన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత పెడదారి పడుతున్నారన్నారు. సమానత్వం, సమ సమాజ కోసం జరుగుతున్న పోరాటంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వేచ్చా, స్వాతంత్ర్యం కోసం దోపిడీ, పీడన లేని నూతన వ్యవస్థ కోసం యువతీ యువకులు తిరుగుబాటుకి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజు గురు, సుఖదేవ్ ల వర్ధంతులను పి.డి.ఎస్.యూ.-పి.వై.ఎల్. ఆధ్వర్యంలో గ్రామగ్రామాన, వాడవాడనా జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ నాయకులు గూడెం నరేష్, గొల్లపల్లి రాజు, కొండే బీరయ్య, ఆసర్ల స్వామి, బర్ల పరుశురామ్, గూడెం నరసింహులు ,గూడెం యాదగిరి  తదితరులు పాల్గొన్నారు.
Spread the love