డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం.!

– హుస్నాబాద్ పట్టణంలో అవగాహన ర్యాలీ 
– హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
డ్రగ్స్ రహిత సమాజాన్ని భవితరాలకు అందించేందుకు మారకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యతగా పనిచేయాలని హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మారకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు ఉపన్యాసం, పెయింటింగ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కళాశాల పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసి ఉందన్నారు.  కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు మానసిక స్థితిని కోల్పోయి  నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. నరాలు గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు.  గ్రామాలలో పట్టణాలలో  మారకద్రవ్యాల విషయములో  మారకద్రవ్యాలకు యువతను దూరంగా  ఉంచాలని సూచించారు. డ్రగ్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సర్కిల్ ఎస్ఐలు మహేష్, తిరుపతి, వివేక్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది పోలీస్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.
Spread the love