హైదరాబాద్ : మహారాష్ట్ర టూరిజం అండ్ ట్రావెల్ సోమ వారం హైదరాబాద్లో రోడ్షో నిర్వహించింది. తమ ప్రదర్శనకు భారీ స్పందన లభించిందని ఆ రాష్ట్ర పర్యాటక విభాగం కార్యదర్శి జయశ్రీ భోజ్ తెలిపారు. ఈ షోకు నగరంలోని పర్యాటక రంగంలోని ప్రముఖులు హాజరయ్యారని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో అనేక అధ్యాత్మిక కేంద్రాలు సహా ప్రకృతి అందాలు నెలువై ఉన్నాయన్నారు. అంతరాష్ట్ర పర్యాటకాన్ని ప్రోత్సహించా లనేదే తమ లక్ష్యమన్నారు. తాము దేశంలో నిర్వహిస్తున్న రోడ్షోలకు గొప్ప స్పందన లభిస్తుందన్నారు.