ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయండి 

– మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు టి.టి. యాదవ్
నవతెలంగాణ – రామగిరి 
రేపు ఉదయం 10.00 గంటలకు గోదావరిఖని రోడ్డులోని శివ కిరణ్ గార్డెన్స్ లో నిర్వహించనున్న మంథని నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ కోరారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని శానన నభ్యులు పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమనికి మంథని నియోజకవర్గంలోని అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని  విజయవంతం చేయాలని కోరారు. అలాగే అదే రోజు ఉదయం 9 గంటలకు మంథనిలో  ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ళ శ్రీపాద రావు వర్ధంతి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొంటారని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కుటుంబ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Spread the love