వివాహిత ఆత్మహత్య..

నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని కన్జర్ గ్రామంలో గల వర్ష (40) సంవత్సరాలు, అదే గ్రామానికి చెందిన గోవర్ధన్ అనే వ్యక్తితో 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అప్పటినుంచి తరచుగా భార్యాభర్తలకు గొడవ జరుగుతుంది. మృతురాలికి ముగ్గురు పిల్లలున్నారు. వ్యవసాయ నిమిత్తం తీసుకువచ్చిన పురుగుమందును సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించిందని మోపాల్ ఎస్ ఎస్  గంగాధర్ తెలిపారు. అలాగే భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Spread the love