వివాహిత బలవన్మరణం..

నవతెలంగాణ – ధర్మసాగర్
భర్త అత్తమామల వేధింపులు తారలేక బలవన్ మరణం చెందిన వివాహిత ఘటన శనివారం చోటు రాత్రి చోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వక్కల భద్రయ్య సాయి పేట గ్రామం, ఫైర్ ఆఫీసర్ రిటైర్డ్  తన కూతురిని మడికొండ గ్రామానికి చెందిన కొలిపాక రాజయ్య కుమారుడు కొలిపాక రమేష్ రైల్వే ఉద్యోగికి 2013 లో ఇచ్చి వివాహం జరిపించడం జరిగిందన్నారు. లాంచినాల ప్రకారం ఐదు లక్షల వరకట్నం,ఎనిమిది తులాల బంగారం, ఇతర లాంఛనాలతో వివాహం చేయడం జరిగిందని ఆరోపించారు. ఈ క్రమంలో భర్త అత్తమామ   పలుమార్లు అదనపు కట్నం కోసం నిత్యం వేధించే వారిని, ఈ క్రమంలో తేదీ 01.06.2024 వారి  మానసిక,శారీరక వేధింపులు తాళలేక గుర్తుతెలియని మాత్రలు మింగగా బలవన్ మరణానికి పాల్పడినట్లు తెలిపారు.ఎస్. ఎస్. ఓ. ధర్మసాగర్ పైన తెలిపిన ముగ్గురిపై తండ్రి వక్కల భద్రయ్య  ఇచ్చిన దరఖాస్తు మేరకు పైన తెలిపిన ముగ్గురిపై కేసు నమోదు చేసి,తదుపరి విచారణ జరుపుతున్నారు. మృతురాలికి 10 సంవత్సరాల వయసు గల ఒక కుమారుడు ఉన్నట్లు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Spread the love