- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీవకోన సమీపంలో ప్రారంభమైన మంటలు మొండోడికోన నుంచి తిమ్మినాయుడుకోన వరకు వ్యాపించి సుమారు 2 కిలోమీటర్ల మేర అడవి దగ్ధమైంది. ఈ ఘటనలో విలువైన వృక్షాలు, వనమూలికలు నాశనమయ్యాయి. వన్యప్రాణులు భయంతో పరుగులు తీశాయి. అటవీ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
- Advertisement -



