రాజన్న గోశాలలో మెగా మెడికల్ క్యాంపు..

నవతెలంగాణ – వేములవాడ
రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సూచనల మేరకు గురువారం  తిప్పాపురంలోని రాజన్న ఆలయ గోశాలలో నున్న కోడెలను మెగా క్యాంపు ద్వారా డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో 20 మంది డాక్టర్ లు 10 మంది సిబ్బంది 1500 కోడెలకు ఆరోగ్య తనిఖీలు చేసి అనారోగ్య సమస్యలున్న కోడెలకు వ్యాక్సిన్లు మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు బ్రహ్మన్న గారి శ్రీనివాస్, ప్రతాప నవీన్  పర్యవేక్షకులు నాగుల మహేష్ తో పాటు వైద్య ,దేవాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Spread the love