ఎంఈఓ ను సస్పెండ్ చేయాలి: జేరిపోతుల జనార్ధన్ 

నవతెలంగాణ – చేర్యాల
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిద్దిపేట జిల్లా చేర్యాల మండల విద్యా శాఖ అధికారి ని వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ డిమాండ్ చేశారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మండల విద్యా శాఖ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు.అనంతరం జేరిపోతుల జనార్ధన్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైన కనీసం కార్యాలయంలో  సిబ్బంది అందుబాటులో లేరని, ఫోన్ ద్వారా ఎంఈఓ తో మాట్లాడితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అన్నారు. మండల కేంద్రంలో అనుమతులు లేకుండా కార్పొరేట్ పాఠశాలలు నడుస్తున్న కనీస చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్య ధోరణి తో వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగళ్ళ నరేష్, జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల ప్రసన్న కుమార్, జిల్లా నాయకులు చెట్ల సమ్మన్న, జిల్లా కౌన్సిల్ సభ్యులు సిద్దుల సుమన్, చేర్యాల మండల నాయకులు యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love