బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి: ఎంఈఓ స్వామి

నవతెలంగాణ – భీంగల్
బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని ఎంఈఓ స్వామి తెలియజేశారు. గురువారం పట్టణ కేంద్రంలోని బోయ గల్లి లో గల  బాలికల ఉన్నత పాఠశాలలో జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ప్రతి గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వ  విద్య ఆవశ్యకతను తల్లిదండ్రులకు తెలియజేశారు.  ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ  ప్రభుత్వం అందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత సౌకర్యాలు కల్పిస్తూ  అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను అందిస్తుందని కనుక పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘు వాస్, రాములు, వాసుదేవ్ ,భాగ్యలక్ష్మి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love