స్కూల్ విద్యార్థులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్..

నవతెలంగాణ-హైదరాబాద్ : విద్యార్థులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. 5 నుండి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీ కోసం ప్రవేశాలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 12 నుండి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ ప్రవేశ ద్వారా ఎస్సీ గురుకులాల్లోని మిగిలిన సీట్లను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. గురుకులాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తామని తెలిపారు. కాగా, ఎస్సీ గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీకి ప్రభుత్వం గతంలోనే పరీక్ష నిర్వహించింది. ఫస్ట్ ఫేజ్‌లో కొన్ని సీట్లు మిగిలిపోవడంతో వాటిని భర్తీ చేసేందుకు తాజాగా విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది.

Spread the love