విద్యార్థులను లక్ష్యసాధన దిశగా నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదే: ఎమ్మెల్యే

నవతెలంగాణ –  తిరుమలగిరి
విద్యార్థులను లక్ష్యసాధన దిశగా నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శుక్రవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో జరుగుచున్న వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు విద్యాదశ నుంచే క్రమశిక్షణతో ఉండాలని, అప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అర్హత సాధిస్తారన్నారు. ముఖ్యంగా వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి  ఎలాంటి ఒత్తిడి భయం లేకుండా ఆసక్తితో పట్టుదలతో కష్టపడి చదివి ఉత్తమ గ్రేడ్ పాయింట్ సాధించాలని, పాఠశాలకు, విద్య నేర్పిన గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనిఅన్నారు.అదేవిధంగా విద్యార్థులను లక్ష్యసాధన దిశగా నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథి డిఎస్పి నాగభూషణంతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love