భారీ మెజార్టీతో ఎంపిగా మోగిలయ్యను గెలిపించాలి..

నవతెలంగాణ-వీర్నపల్లి : కరీంనగర్ పార్లమెంటు సభ్యుడుగా బిఎస్పి  అభ్యర్ధి బలపరచిన మారపెల్లి మోగిలయ్య ను గెలిపించాలని బిఎస్పి మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్ కోరారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో బిఎస్పీ మండల అధ్యక్షులు అధ్వర్యంలో ఇంటింటి కి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఒకవైపు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఒక కుట్ర పూరితంగా అంతర్గతంగా భాజపా, భారసలు కలిసి ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మరొక్క వైపు అధికార కాంగ్రెసు పార్టీ కూడా ఎస్సీ,ఎస్టీ, బీసీ, రిజర్వేషన్లు తీసివేస్తామని  ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఈ మూడు దోపిడీ పార్టీలు అధిక సంఖ్యలో ఓట్లు కలిగిన బహుజన ప్రజలను మరొక్క సారి మోసం చేసే పనిలో ఒకరికంటే ఒకరు పోటీపడుతున్నా పార్టి లను  ఎంపీ ఎలక్షన్స్ లో ఓడించి  బుద్ది చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్జనపల్లి బూత్ అధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్, నగరపు పోచయ్య, నగరపు దేవయ్య, గొర్రె రాజయ్య, మల్యాల రాములు, లంక రాజయ్య, దువ్వల  రాజయ్య తదితరుల పాల్గొన్నారు.
Spread the love