– కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేత
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బి) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పి. మోహన్ బాధ్యతలు సోమవారం స్వీకరించారు. ఈ మేరకు ఆయన, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కె. రవి శంకర్ నుంచి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా రోడ్ల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని మోహన్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా శాఖ అధికారులు, సిబ్బంది మోహన్కు అభినందనలు తెలిపారు.
ఆర్అండ్బి అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మోహన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES