ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం..

నవతెలంగాణ-హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇండియా కూటమి 295కు పైగా సీట్లు గెలుచుకోనుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమిలోని కీలక నేతలతో తన నివాసంలో భేటీ అయిన ఖర్గే ఎన్నికలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 295కు పైగా స్థానాలు గెలుచుకుంటుంది. ఫలితాల్లోనూ ఇదే వెల్లడవుతుంది. మా కూటమిలోని నేతలు ప్రజల్లోకి వెళ్లి సర్వే నిర్వహించారు. వారితో రెండు గంటలకు పైగా చర్చలు జరిపాం. సర్వే ప్రకారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాం. ముఖ్యంగా కౌంటింగ్‌ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అన్ని పార్టీలు తమ కార్యకర్తలకు సూచనలు ఇవ్వాలని నిర్ణయించాం. మేము ప్రజలకు వాస్తవాలను చెప్పాలనుకుంటున్నాం’’ అని ఖర్గే పేర్కొన్నారు.

Spread the love